39.2 C
Hyderabad
May 3, 2024 13: 15 PM
Slider ఆదిలాబాద్

బీఆర్ఎస్ విజయవంతం కావాలని బాసరలో పూజలు

#basara

సీఎం కేసీఆర్ నూతన పార్టీ విజయం సాధించాలని బాసర శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నూతనంగా భారత్ రాష్ట్రీయ సమితి నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు బాసర శ్రీ సరస్వతీ దేవి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాలు మేరకు అమ్మవారి ఆలయంలో అర్చకులు నూతన పార్టీ గొప్ప విజయ సాధించాలని పూజలు చేశారు.

సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని విజయ దశమి విజయం చేకూర్చాలని అమ్మవారికి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బాసర మండల టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ శ్యామ్, బాసర సర్పంచ్ లక్ష్మణ్ రావు, వైస్ ఎంపిపి నర్సింగ్ రావు, సహకార సంఘం చైర్మన్ వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నుకం రామారావు, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవేంధర్, మాజీ మండల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్, ఉప సర్పంచ్ పద్మారావు, నర్సయ్య  కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

ప్రారంభమైన హీరో సాయిరాం శంకర్ సినిమా “వెయ్ దరువెయ్”

Satyam NEWS

నాగర్ కర్నూల్ పట్టణంలో ఒక మహిళకు కరోనా

Satyam NEWS

అక్రమ దందాలో బి.ఆర్.యస్. నాయకులు

Satyam NEWS

Leave a Comment