మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాల్లో, శివాలయాల్లో ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్నాయి. కీసరగుట్ట లోని రామలింగేశ్వర ఆలయ శైవ క్షేత్రం శివరాత్రి నాడు ఆధ్యాత్మికత శోభతో అలరారుతుంది. శివరాత్రి సందర్భంగా తెల్లవారు జాము నుండి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లు కేసరిగుట్ట లోనే రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గం లోని పలు డివిజన్ల లోని శివాలయాల్లో స్థానిక కార్పొరేటర్ ల తో కలిసి ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్ ,మీర్పేట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండరాపు శ్రీనివాస్ రెడ్డి, ధన పాల్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డప్పు గిరిబాబు, సి. సీ. యస్ పద్మ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి ,బద్దం భాస్కర్ రెడ్డి , గడ్డం రవి కుమార్ ,గరిక సుధాకర్, టీం బిఎస్ఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు భేతీ సుమంత్ రెడ్డి, కంకణాల శ్రీకాంత్ రెడ్డి, పళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి , జెసిబి రాజు, నంది కంటి శివ, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి