ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రేటర్ హైదరాబాదు నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కాప్రా సర్కిల్, కప్రా డివిజన్ పరిధిలోని బాలాజీ నాయక్ తండా లో శ్రీ కనక దుర్గా దేవి ఉత్సవాల్లో హైద్రాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సంద్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజ్ ,మాజీ కార్పొరేటర్ గోళ్లురి అంజయ్య ,మేకల హనుమంత్ రెడ్డి, (a to z)నందికొండ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పార్వతి నాయక్, బానోతు వాల్య నాయక్, మధుమతి నాయక్, హరి నాయక్, రాహుల్ నాయక్, వినయ్ నాయక్, బాలకృష్ణ నాయక్, సురేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్, సుధాకర్ నాయక్, రవి నాయక్, రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి