ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ తన విచారణ కొనసాగిస్తున్నది.
ఈ హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడపజిల్లా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో 90వ రోజు విచారణ లో భాగంగా సీబీఐ అధికారులు జగన్ మేనమామ ను పిలిచారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ జరిగింది.
సీఎం జగన్ మేనమామ రవీంద్ర నాథ్ రెడ్డి తొలిసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.