ఉత్తరాంధ్ర లో అధికార పార్టీ… తన ప్రాభవాన్ని చూపించేందుకు… ప్రతీ నియోజకవర్గంలో ప్లీనరీ లు నిర్వహిస్తున్నాయి.నిన్న గరివిడి కాగి తాజాగా విజయనగరం లో పార్టీ ప్లీనరీ జరిగింది. అయితే చీపురు పల్లి నియోజకవర్గ మైన..మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గ పరిధిలోని గరివిడి లో వైఎస్సార్ పార్టీ ప్లీనరీ జరిగింది.
ఈ మేరకు గరివిడి ఫెకర్ క్లబ్ ఆవరణలో జరిగిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు,విజయనగరం జిల్లా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు,విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ,ఎమ్మెల్సీ పార్వతీపురం మన్యం జిల్లా ప్లీనరీ ఇంఛార్జ్ ఇందుకూరి రఘురాజు ,ఎక్స్ ఎమ్మెల్యే మరియు చీపురుపల్లి ప్లీనరీ ఇంచార్జ్ శోభా హైమావతి
ప్రారంభానికి ముందు సభ ఆవరణలో పార్టీ జెండా ఎగురవేసి,వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహమునకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గంలో దాదాపు 790 కోట్లతో అనేక సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచెప్పాలన్నారు.
ఇంత సంక్షేమ అందిస్తున్న సీఎం జగన్ పట్ల మరియు ప్రభుత్వం పట్ల గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. పార్టీకి ప్రభుత్వానికి ఆకర్షితులను చేసి 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో గల నాలుగు మండల పార్టీ అధ్యక్షులు, జె.డ్పీ.టి.సిలు,మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,ఎం.పి.టి.సిలు సర్పంచులు వైస్.సర్పంచులు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.