శారీరక మానసిక అభివృద్ధికి క్రీడలు తప్పనిసరి అని ఎస్ ఐ వెంకటరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో గురువారం జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్ ను వీక్షించి ఆటల పోటీలను ప్రారంభించారు.
అనంతరం ఎస్ ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ నేటి యువతరం ఆటలు వదిలేసి చరవాణి చుట్టూ తిరుగుతూ కాలం గడుపుతున్నారని, ప్రతి విద్యార్థి మైదానంలో ఆటలు ఆడడం ద్వారా శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతరాని అన్నారు. విద్యార్థులు ఇళ్లను వదిలి మైదానాల వైపు పరుగులు తీయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తుమ్మ సరితా మరెడ్డి,కరస్పాండెంట్ కృష్ణారావు ప్రిన్సిపల్ రాజారెడ్డి,పి ఈ టి రామకృష్ణ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్