39.2 C
Hyderabad
May 3, 2024 12: 36 PM
Slider అనంతపురం

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్ల అభివృద్ధి

#ananthapuram

అనంతపురం నగర స్వరూపం మార్చేలా రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని హోసింగ్ బోర్డ్ సర్కిల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో జరుగుతున్న బీటీ రోడ్ పనులను మేయర్ వసీం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తో కలసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో నగర వ్యాప్తంగా వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నరేళ్ళ కాలంలోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటే నగరాభిరుద్ది పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కోవిడ్ మూలంగా కొన్ని పనులలో జాప్యం జరిగిందని, రానున్న రెండేళ్లలో నగరంలోని రోడ్లు అన్నింటినీ పూర్తి చేసి అనంతపురం పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో,వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఈఈ రామ్మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు సంపంగి రామంజినేయులు, అనీల్ కుమార్ రెడ్డి, లీలావతి, కమల్ భూషణ్,బాబా ఫక్రుద్దీన్, డివిజన్ కన్వీనర్ నాగార్జున రెడ్డి,డీలర్ చెన్నారెడ్డి, డిఈ చంద్రశేఖర్, ఏఈ బాబావలి,కాంట్రాక్టర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజమండ్రి జైలులో దేవినేని ఉమకు ప్రాణ హాని

Satyam NEWS

T-shirt discussion: వణికించే చలిలో కూడా టీషర్ట్ తోనే రాహుల్

Satyam NEWS

కాంట్రవర్సీ: ట్రాఫిక్ పోలీసులతో సిఎం మేనల్లుడి(?) రభస

Satyam NEWS

Leave a Comment