27.7 C
Hyderabad
April 26, 2024 07: 00 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం

ganja smuglers

హైదరాబాద్ నగరంలో గంజాయి స్మగ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ఈ ముఠా విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతుంటుంది.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో విశాఖ కు చెందిన కయ్యం నాగరాజు, పీరి చిన్నారావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మర్గల దుర్గాబాబు, కొత్తగూడెం జిల్లా కు చెందిన గొల్లోరి నరసింహా ఉన్నారు. ఒడిసా లోని సరిహద్దు గ్రామాలలో గంజాయి పెంచి ఎండబెట్టి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతుంటారు.

గత ఏడాదిగా వీరు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులు కచ్చితమైన సమాచారం అందుకుని ఈ నలుగురిని అరెస్టు చేయగలిగారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఆరు లక్షల 70 వేల రూపాయల వరకూ ఉంటుంది.

Related posts

నా భూమి ఆక్రమిస్తున్నారు అధికారులూ కాపాడండి

Satyam NEWS

మనోవేదనకు గురి అవుతున్న చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని

Satyam NEWS

ఎక్స్ ప్లోజన్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని ప్రమాదం

Satyam NEWS

Leave a Comment