హైదరాబాద్ నగరంలో గంజాయి స్మగ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ఈ ముఠా విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతుంటుంది.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో విశాఖ కు చెందిన కయ్యం నాగరాజు, పీరి చిన్నారావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మర్గల దుర్గాబాబు, కొత్తగూడెం జిల్లా కు చెందిన గొల్లోరి నరసింహా ఉన్నారు. ఒడిసా లోని సరిహద్దు గ్రామాలలో గంజాయి పెంచి ఎండబెట్టి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతుంటారు.
గత ఏడాదిగా వీరు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులు కచ్చితమైన సమాచారం అందుకుని ఈ నలుగురిని అరెస్టు చేయగలిగారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఆరు లక్షల 70 వేల రూపాయల వరకూ ఉంటుంది.