కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అక్షయ సేవా సంఘం ఆధ్వర్యంలో బాడీ స్ప్రే ని స్ప్రింక్లర్ ద్వారా ఏర్పాటు చేశారు. పిడుగురాళ్ల పట్టణంలో మన్నెం పుల్లారెడ్డి హైస్కూల్ వద్ద జన సంచారం ఎక్కువగా ఉన్నందువల్ల ఈ ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఈ రోజున దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ వైరస్ నుంచి రక్షణగా ఈ బాడీ స్ప్రే సానిటైజర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ముందుకు వచ్చి విరివిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేద ప్రజలందరికీ సహకరించవలసిందిగా కోరారు.
అక్షయ సేవా సంఘం చేసిన పలు సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, అక్షయ సేవా సంఘం సభ్యులు టంగుటూరు సతీష్, కొనకండ్ల శ్రీను, కోడూరు శంకర్ పాల్గొన్నారు.
ఇంకా గుండా నారాయణ, కొత్త కాశీ, గుండా రమేష్, ఆవుల జనార్ధన్, ఏచూరి నరసింహారావు, పిల్లి చెన్నారావు, కనమర్లపూడి రవికుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.