కదిరి పున్నమి పండగ లో విషాదం చోటు చేసుకున్నది. మదనపల్లె రూరల్ మండలం చీకిలబైలు సమీపంలోని కదిరమ్మ చెరువులో ఈతకు వెళ్ళి ఇద్దరు చిన్నారులు మరణించారు. పండుగ సెలవు కావడంతో స్కూల్ వెళ్లకుండా పోలం దగ్గరకు వెళ్ళి ఆడుకుంటూ సందీప్ కుమార్, గణేష్ అనే ఇద్దరు చెరువులో దిగారు.
చెరువులో ఈతకు దిగిన వీరికి ఈత రాకపోవడంతో మునిగి చనిపోయారు. సమీప ప్రజలు గుర్తించి వారిని బయటకు తీశారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.