ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరుగు జరిగింది. ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా నగరంలో ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ జరిగింది. ఈ రన్ రాజీవ్ స్టేడియం నుంచి కోట వరకు పరుగు నిర్వహించారు.
ఈ ఒలింపిక్ డే రన్ ను ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘు రాజు, పెన్మత్స సురేష్ బాబు, రఘు వర్మ లు ప్రారంభించిన అనంతరం రాజీవ్ స్డేడియం నుంచీ కోట వరకు జరిగిన పరుగు లో స్వయంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గురాన అయ్యలు, అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, అసోషియేషన్ నాయకులు కె.సుభాష్ చంద్రబోస్, అల్లు నరేంద్ర, కోలగట్ల ప్రతాప్, టి.వి భగవాన్ దాస్, కె.సన్యాసి నాయుడు,కె.గోపాల్, వి.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరుగులో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత, క్రీడాకారులు పాల్గొన్నారు.