విజయవాడ మోగల్ రాజపురంలో శ్రీ శివ గిరి కొండపైన ఉన్న దేవాలయంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఎవరో దుష్టశక్తులు విరగ్గొట్టారు.
ఈ దుశ్చర్యను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ నిరసన తెలిపింది. సత్యనారాయణపురం విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుండి శ్రీ శివ స్వామిజీ దేవాలయం చేరుకుని అక్కడ తమ నిరసన తెలిపారు.
దుండగుల అరెస్టుకు డిమాండు చేశారు. ఈ దుశ్చర్య గురించి స్వామీజీ విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత మాచవరం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.
దుండగులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరగా పోలీసు వారు వెంటనే దర్యాప్తు చేసి , నేరస్తులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో VHP అధ్యక్షులు సాన శ్రీనివాస్, నాగలింగ శివాజీ, నందిగం కిశోర్, చిక్కాల రజనీకాంత్, హిందూ చైతన్య వేదిక సత్యనారాయణ మూర్తి, స్థానిక ప్రజలు, కార్యకర్తలు పాల్గోన్నారు.