కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామంలో వైభవోపేతంగా శ్రీ సంజీవరాయ స్వామి వారి పొంగళ్ళు సమర్పించారు. వందల సంవత్సరాల నుండి తిప్పాయపల్లిలో సంజీవరాయ స్వామికి మగవారిచే ప్రత్యేక పొంగళ్ళు సంప్రదించే సాంప్రదాయం ఉంది. కడప జిల్లాలో మహిళలకు ప్రవేశం, ప్రసాదం స్వీకరణకు అనుమతి లేని ఏకైక ఆలయం తిప్పాయపల్లి సంజీవరాయ ఆలయం. మహిళలు ఆలయం బయట నుండే సంజీవరాయ స్వామిని దర్శించుకోవాలని ఊరి కట్టుబాటు గల పవిత్ర ఆలయం. సంక్రాంతి కి ముందు వచ్చే ఆదివారం శ్రీ సంజీవరాయ స్వామికి వారికి మగవారు పొంగళ్ళు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామానికి చెందిన ప్రజలు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఆదివారం రోజు గ్రామానికి చేరుకుని పురుషులే పొంగళ్ళు పెట్టుడం ఆనవాయితీ.
previous post