33.7 C
Hyderabad
April 29, 2024 00: 15 AM
Slider మహబూబ్ నగర్

అత్యాచారం చేసే కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలి

#mala

మైనర్ బాలికలపై సామూహిక లైంగిక దాడులు చేస్తున్న మదమెక్కిన కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలని మాలల  చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు పాతబస్తీకి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

వరుసకు అన్న అయిన పెదనాన్న కుమారుడు ఐదు నెలలుగా ఆమెపై అత్యాచారం చేశాడని ఆయన తెలిపారు. బలవంతంగా అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తా అని భయపెడుతూ వాడు వాడి స్నేహితుడు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ సామూహిక అత్యాచారం చేశారని ఆయన అన్నారు.

అమ్మ అక్క చెల్లి రక్త బంధాలు తెలియని ఇలాంటి కామ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్ మొగల్ పురాలో మరో బాలికపై సామూహిక అత్యాచారం ఇంకో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఇలా తరచుగా  మైనర్ బాలికలపై వారి జీవితాలు నాశనం చేస్తున్న నిందితులను తక్షణమే శిక్షించాలని ఆయన కోరారు.

దిశ చట్టాలు ఎన్ని తెచ్చిన సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బయటకి వెళ్లి తిరిగి ఇంటికి క్షేమంగా తిరిగి క్షేమంగా వస్తుందని నమ్మకం లేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న నిందితులను కాపాడడం కోసం రాజకీయ నాయకులు బాధిత కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని కేశవులు అన్నారు.

మహిళల అత్యాచారాలపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పత్తి యాదయ్య మంత్రి వెంకట్ రాములు, కాంతారావు,టి కొండల్ పాల్గొన్నారు.

Related posts

విఆర్ఏ పోస్టుల సర్దుబాటు పై స్టే

Bhavani

సోమవారం పరీక్షను వాయిదా వేసిన వి ఎస్ యూ

Satyam NEWS

వ‌ర‌ద స‌హాయం ఎలా అందుతోంది?

Sub Editor

Leave a Comment