అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం కు చెందిన రాష్ట్ర డిఆర్డిఏ విశ్రాంత అధికారి యల్లటూ రు శ్రీనివాసరాజు శుక్రవారం గుంటూరు మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పవన్ ను మర్యాదపూర్వ కంగా కలిశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై కలిశారు. ఇరువురు దాదాపు గంటసేపు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీ యాలు, శ్రీనివాసులు పార్టీలో చేరడానికి కారణాలను పవన్ కళ్యాణ్ కు వివరించారు. పవన్ కళ్యాణ్ శ్రీనివాస రాజుకు మరో నాలుగు సంవత్సరాల ఉద్యోగ సర్వీసు ఉండగా రాజీనామాపై ప్రశ్నించగా తాను జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి, మీ వెంట నడవడానికి రాజంపేట నుంచి ప్రత్యక్ష రాజకీయాలలోనికి అడుగుపెట్టతున్నట్లు పవన్ కళ్యాణ్కు తెలిపారు.
శ్రీనివాసరాజు దాదాపు ఏడాది కాలంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తూ అన్ని వర్గాల వారి మద్దతు కూడ కట్టిన నేపథ్యంలో జనసేనలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ శ్రీనివాసరాజు తో జరిగిన చర్చలు సానుకూలంగా నడిచాయి. పవన్ కళ్యాణ్ జనసేన లోనికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజాసేవ చేసే నిస్వార్ధపరులు కావాలని శ్రీనివాసరాజు అభిప్రాయాలను తెలుసు కున్న పవన్ శ్రీనివాసరాజును పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కడప, అన్నమయ్య జిల్లాలలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. శ్రీనివాసరాజు తాను ప్రతిఫలం ఆశించి జనసేన పార్టీలో చేరడం లేదని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జన సైనికునిగా కొనసాగుతానని పార్టీని బలోపేతం చేయడమే ధ్యేయమని శ్రీనివాసరాజు మీడియాకు వివరించారు.