తెలంగాణ 32వ,రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వాసవి భవన్ లో అట్టహాసంగా జరిగింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ ,జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహరావు,జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు దేవరం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపు కార్యక్రమాన్ని హుజూర్ నగర్ వాసవి భవనంలో ఏర్పాటు చేశారు.
క్యాంపులో భాగంగా బాల బాలికల కోసం మ్యాట్ పై కోర్టును ఏర్పాటు చేసి భోజన వసతి సౌకర్యాలను కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అమర్నాథ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సంపత్,పట్టణ టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ అమర్ గౌడ్, కౌన్సిలర్ జక్కుల శంబయ్య, విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరావు,కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యాంపు సౌకర్యాలను అభినందించి, క్రీడాకారులకు స్ఫూర్తివంతమైన ఉపన్యాసం ఇచ్చారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్