రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి గండుగులపల్లిలో ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుని కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పామాయిల్ పరిస్థితులపై కొద్దిసేపు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పిటిసిలు, దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, పామాయిల్ కర్మాగారం మేనేజర్లు బాలకృష్ణ, కల్యాణ్ ,బిఅర్ఎస్ నాయకులు కాసాని నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.