పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం అదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పొగ త్రాగడం వల్ల ఇతరులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న మరణాల్లో పొగ తాగేవారు, పొగ పీల్చే వారే అధికంగా ఉన్నారని వెల్లడించారు. పొగ తాగడం, గుట్కా నమలడం వల్ల కాన్సర్ తో పాటు శ్వాస సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. దుకాణదారులు విధిగా పొగ తాగటం నేరం అని రాసిన హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోసం ఎలాంటి స్టిక్కర్లు అంటించ కూడదని అన్నారు. నిబంధనలు పాటించాలని, లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బహిరంగ ధూమపానం చేసిన ఇద్దరికి జరిమానాలు విధించారు. ఆయన వెంట చిరంజీవి, ఆశన్న ఉన్నారు.