తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడు, బిజెపి రాజ్యసభ సభ్యుడు ప్రొఫెసర్ రాకేష్ సిన్హా దేవస్థానం ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. టీటీడీ ఆస్తుల అమ్మకం నిర్ణయం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు.
స్వామివారికి భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను విక్రయించడం అంటే భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని, ఈ నిర్ణయంపై పునరాలోచన చేస్తే బాగుంటుందని సూచించారు. తెలుగుదేశం హయాంలో తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పడం పై కూడా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేవారు.
తమిళనాడులో ఉన్న 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని టీటీడీ భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.