విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద రాత్రి 10 గంటల సమయంలో కూడా ఆందోళన కొనసాగుతోంది. సంక్షేమ హాస్టళ్లను తెరిపించాలని చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది.
ఉదయం నుంచీ చేపట్టిన విద్యార్ధుల ఆందోళనలు నిరసన ప్రదర్శనలు రాత్రి పదకొండు అయినా కొనసాతునే ఉంది.
తమ డిమాండ్లు పరిష్కరించేవరకూ కలెక్టరేట్ ప్రాంగణం నుంచీ కదిలేది లేదని విద్యార్థులు భీష్మించుకుని బైఠాయించారు. వన్ టౌన్ పోలీసు స్టేషన్ నుంచీ నలుగురు ఎస్ఐలు ఓ ప్లటూన్ పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఓ వైపు రాత్రి పది దాటగానే కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఏ క్షణాన్నైనా విద్యార్థులు అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. డీఎస్పీ అదేశాల మేరకు సిబ్బంది ఎదురు చూస్తున్నారు.