ఎడతెరిపి లేకుండా వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు నిరంతరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కంటిపై కునుకు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ని కొద్ది సేపటి కిందట ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సందర్శించారు. ఆయనతో బాటు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం కూడా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రజలను కోరారు.