తమిళనాడు రాష్ట్రం లోని కొడైకొనల్ కు విహార యాత్ర కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం విద్యార్ధులకు శాపమైంది. అనంతపురం వికాస్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థులు రెండు బస్సులలో సుమారు 100 మంది ఈ టూర్ కు వెళ్లారు. వారు తిరిగి అనంతపూర్ కు వస్తున్న సమయంలో ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ బస్సు ఓవర్ ట్రాక్ చెయ్యబోయి వెనుక వైపు ఢీ కొట్టింది.
దాంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్ధులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం పంపారు. ఒక్క విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఆఫ్రిద్, ఫర్దిన్, అభిలాష, చరణ్, శ్రీనాథ్, సంతోష్ కుమార్, చరణ్ తేజ్, నవీన్ తదితరులు ఉన్నారు.