గుంటూరు జిల్లా నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్ స్టేడియం ఎదురుగా ఉన్న అమేజింగ్ చిల్డ్రెన్స్ హోమ్ లోరోటరాక్ట్ క్లబ్ ఆఫ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల బాలికలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అదే విధంగా వారికి స్కూల్ బాగ్స్, స్టడీ ఛైర్స్, నిత్యావసర సరుకులు, నోట్ బుక్స్, మిక్సీ, కుక్కర్, సోప్స్, నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు.
ఆదివారంనాడు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ హాజరయ్యారు. కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ డైరక్టర్ నాతని వెంకటేశ్వర్లు, రోటరీ క్లబ్ అధ్యక్షులు మెళ్ల చెరువు సుమిత్ర కుమార్, పబ్లిక్ ఇమేజ్ డైరక్టర్ యస్ కె. జిలాని మాలిక్, RAC చైర్మన్ కట్టామురి అంజనేయులు, మాజీ RAC చైర్మన్ మామిడి సుబ్బారావు 2022 – 2023 ఎలెక్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, సెక్రెటరీ వనమా పవన్, దాతలు B.V. సత్యనారాయణ (ప్రవల్లిక సత్యం), శ్రీ తిరువీదుల సుధాకరరావు, రోటారాక్ట్ అధ్యక్షులు తోట రాజశేఖర్, కోశాధికారి అవినాష్ ,కార్యదర్శి గురువర్ధన ,కమ్యూనిటి డైరెక్టర్ సాయి కుమార్ , చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ నాగమణి, మరియు వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా గడియారం స్తంభం పునర్ నిర్మాణం, గవర్నమెంట్ హాస్పిటల్ కు వైద్య సేవలు, వివిధ పాఠశాలలకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చారని కొనియాడారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్