వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జాన్యానికి నిరసనగా మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నంద్యాల జిల్లా లో ఈ దుర్ఘటన జరిగింది. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట రవికుమార్ అనే వ్యక్తి ఒంటిపై డీజల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బేతంచెర్ల మండలం కుమ్మరి కొట్టాలలో రవికుమార్ పొలంలో వైస్సార్సీపి నాయకులు అక్రమంగా రోడ్డు వేస్తున్నారని చాలా సార్లు అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. అధికారులను నుండి న్యాయం జరగకపోవడంతో నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట నేడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
next post