రాష్ట్రంలో మత్య్స, ఆక్వారంగాలకు మంచి జరిగేలా కార్యక్రమాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ చెప్పారు. ఈ మేరకు బాపట్ల జిల్లా లో మత్య్సకారులకు..భరోసా నిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిపుణులను తయారు చేసే విధంగా ఫిషరీస్ యూనివర్సిటీ పశ్చిమ గోదావరిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజాంపట్నం పరిధి దిండి గ్రామం వరుసవారి పాలెంలో 280 ఎకరాల స్థలంలో సీఎం ఆక్వా పార్కుకు శంకుస్థాపన చేసారు. నాణ్యమైన ఫీడ్, సీడ్ అందించడమే దీని లక్ష్యమని ఆక్వా పార్కు ఏర్పాటుతో అన్ని రకాల సీడ్లను తయారీ జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. నిజాంపట్నంలోనే సీడ్ మేకింగ్ యూనిట్.. 21వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. 417 కోట్లతో ఫిషింగ్ హార్బర్ను కూడా నిజాంపట్నంలో ఏర్పాటు చేయడం.. గర్వంగా ఉందన్నారు.
previous post