39.2 C
Hyderabad
May 3, 2024 13: 29 PM
Slider కరీంనగర్

కోడిపందాల స్థావరంపై పోలీసు దాడులు

jagityala

సాధారణంగా ఇలాంటి వార్తలు సంక్రాంతి సీజన్ లో ఆంధ్రాలోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వస్తాయి. ఈ సారి వెరైటీగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా నుంచి వచ్చింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కోడి పందాల స్థావరాలు ఏర్పాటు చేసుకుని కొందరు వ్యక్తులు కోడి పందాలు నిర్వహిస్తున్నారు.

గ్రామ శివారులో పోలీసులు నేడు దాడి చేయడంతో కోడిపందాల స్థావరాల గుట్టు రట్టయింది. ఈ స్థావరాలు నిర్వహిస్తున్న ఐదు గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు,9 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. సక్రాంతి సీజన్ కావడంతో ఆంధ్రాతో బాటు తెలంగాణలోని చాలా గ్రామాలలో కోడిపందాలకు కొందరు సిద్ధమైపోతున్నారు.

Related posts

తెలిసి తప్పు చేస్తే.. ఊరుకునేది లేదు

Satyam NEWS

ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

విఆర్వోలు ఫినిష్… నెక్ట్స్ ఎంఆర్వోలా?ఎంపిడివోలా? సబ్ రిజిస్ట్రార్ లా?

Satyam NEWS

Leave a Comment