భార్య తనపై దిశ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని మనస్తాపం చెందిన భర్త పోలీస్ స్టేషన్ కు సమీపం లోనే
కాళ్ళు చేతులు పై పెట్రోల్ పోసుకుని లైటర్ తో అంటించుకుని గాయాల పాలయ్యాడు. ఏలూరు జిల్లా కొత్తూరుకు చెందిన పరసా డేవిడ్ కు పెదవేగి మండలం వంగూరుకు చెందిన కీర్తి తో వివాహమైంది.వీరిరువురు మధ్య వివాదాలు తలెత్తడం తో కీర్తి తన భర్త డేవిడ్ పై ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన డేవిడ్ కాళ్ళు చేతులు పై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన గమనించిన అక్కడున్న కొంతమంది అతనిని రక్షించి చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని జరిగిన ఘటన పై ఆరాతీస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది