బిజెపి అవలంబిస్తున్న వైఖరి నచ్చకనే రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని ముషీరాబాద్ కు చెందిన సీనియర్ నాయకులు సిహెచ్ సునీల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ హోటల్లో ఆయన మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా పార్టీలో ఏ బాధ్యతలు ఇచ్చిన సమర్ధవంతంగా నిర్వహించి పార్టీకి సేవ చేసి, అభివృద్ధి కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్న తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అని చెబుతున్న బిజెపి అదే బీసీ అధ్యక్షుని అధిష్టానం తొలగించి బిజెపిని ప్రజలకు దూరం చేసిందని విమర్శించారు. అధ్యక్ష పదవి నుండి బీసీని తొలగించి బీసీ ముఖ్యమంత్రి అంటే ఎవరైనా నమ్మే పరిస్థితి లేదన్నారు. క్రమశిక్షణ గల బిజెపి పార్టీ క్రమం తప్పుతుందని అందుకే బిజెపిని వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరానని, ముషీరాబాద్ లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.
ముషీరాబాద్,సత్యం న్యూస్