కరోనా వైరస్ విశాఖలో టిడిపి నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఆర్కేబీచ్ లో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్ధితిలో వైరస్ ఆందోళన రేపుతున్న సమయంలో ప్రజలకు ఏవిదంగా అప్రమత్తం చేసేలా టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకత శిల్పంతో అవగాహన కల్పించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వాసుపల్లి సూచించారు. అదే విదంగా మస్కులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో వైరస్ అనుమానిత కేసులు నమోదువుతున్న నేపధ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.