ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరొక్క సారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి రాజధాని ప్రాంతోం గృహనిర్మాణ జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నిరాశ ఎదురైంది.
రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయ్యే వరకు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
అయితే అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సీజేఐ బొబ్డే అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది.