పాకిస్తాన్ లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. ప్రధానమంత్రి ఇమ్రాన్పై అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. దాంతో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో సహా ఆయన మంత్రి వర్గం, సలహాదారులు అందరూ తిరిగి పదవులు పొందారు. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సలహా మేరకు అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా 5-0 ఓట్లతో ఈ తీర్పును వెలువరించారు. ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తోసిపుచ్చడంతో ఆయన ప్రధాన మంత్రి హోదాలో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని అధ్యక్షుడు ఆమోదించారు. దీనికి మొత్తం మూల కారణమైన డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది.
జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలనే అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ నిర్ణయం కూడా “రాజ్యాంగం మరియు చట్టానికి విరుద్ధం. చట్టపరమైన అధికారం లేకున్నా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు” అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రధానమంత్రి తాను కొనసాగుతున్నందున అసెంబ్లీని రద్దు చేయమని రాష్ట్రపతికి సలహా ఇవ్వలేరని పేర్కొంది. కోర్టు తీర్పు ప్రధానమంత్రిని, ఆయన మంత్రివర్గాన్ని పునరుద్ధరించింది.
జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని శనివారం ఉదయం 10:30 గంటల లోపు తిరిగి సమావేశపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాని ఇమ్రాన్ఖాన్పై అవిశ్వాస తీర్మానం ముగియకుండా సెషన్ను ప్రోరోగ్ చేయలేమని పేర్కొంది. “డిప్యూటీ స్పీకర్ ఏప్రిల్ 3న రూలింగ్ ఇచ్చారు. మార్చి 28న అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.