వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానం ఈనెల 21న జరిగే మహాశివరాత్రి పర్వదిన పర్వదినానికి మంత్రి కేటీఆర్ కు షూ వేసుకొని పవిత్రమైన కండువా ,ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే రమేష్ బాబు అందజేయడం పై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు నిర్లక్ష్యపు చేష్టల పై హిందూ సమాజ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హిందూ వాద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ తన షును విడిచి భక్తిభావంతో ఆహ్వాన పత్రికను అందుకుంటే ఎమ్మెల్యే మాత్రం షూ విప్పకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రమేషుబాబు కు కాలు నొప్పి సమస్య ఉన్నందున షూ తో మోకాలి వరకు అనుసంధానించిన ఒక రాడ్ ఉంటుందని అందుకు ఆయన షూ విప్పడం కుదరదని రమేష్ బాబు అనుచరులు చెబుతున్నారు. ఒక సారి విప్పితే ఆయనకు మళ్ళీ వేసుకోవడం కష్టమని అందుకే విప్పలేదని చెబుతున్నారు.