ఉపరితలం నుండి ఉపరితలం లక్ష్యం గా పని చేసే సుమారు 5,000 కిలోమీటర్ల ఒక లాంగ్ రేంజ్ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ని తయారుచేయాలని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ నిర్ణయించింది.ఈ తయారీతో యుఎస్, రష్యా మరియు చైనా అణు జలాంతర్గాముల ఎలైట్ క్లబ్లో చేరడానికి డిఆర్డిఓ సిద్ధంగా ఉంది.అధికారుల వివరణ ప్రకారం, ఈ క్షిపణి శక్తివంతమైన విధ్వంస సామర్థ్యం అగ్ని-వి సామర్థ్యంతో సరిపోతుంది.
ఆసియాలోని దేశాలలో ఈ క్షిపణి శత్రు నిరోధకంగా 5,000 కిలోమీటర్ల శ్రేణి పనిచేస్తుండటంతో భారతదేశానికి ప్రస్తుతం మరే ఇతర సుదూర క్షిపణిని అభివృద్ధి చేసే ప్రణాళిక లేదు. “ఖండాంతర శ్రేణి యొక్క సుదూర అణు క్షిపణిని నిర్మించగల సామర్థ్యం మాకు ఉన్నప్పటికీ, తుది నిర్ణయం ప్రభుత్వంతో చేతుల్లోనే ఉంటుందని ఉంటుంది. అలాంటి అనుమతి ఇప్పటి వరకు మాకు మంజూరు చేయలేదు లేదా ఆ నిర్ణయం ఆమోదించబడలేదు ”అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి దశను పూర్తి చేసి K-4 జలాంతర్గామి ప్రయోగించిన ప్రేరణతో 5,000 కిలోమీటర్ల శ్రేణి జలాంతర్గామిని తయారుచేయడానికి సముద్రం లో అది ప్రయోగించే ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడానికి డ్రాయింగ్ బోర్డు వద్ద నిర్ణయం తీసుకుంటున్నారని అగ్ని-వి క్షిపణికి-ఉన్నతాధికారులు తెలిపారు.
5,000 కిలోమీటర్ల శ్రేణి జలాంతర్గామి ప్రయోగించినప్పటికిని అది కూడా బాలిస్టిక్ క్షిపణి కె-సిరీస్పేరునే కలిగి ఉంటుందని దక్షిణ చైనా సముద్రంతో సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్ మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతాలన్నింటినీ ఇది కవర్ చేస్తుంది అని అధికారులు తెలిపారు.
ఈ విషయమై డిఆర్డిఓ గట్టిగాచెప్పనప్పటికీ 3,500 కిలోమీటర్ల శ్రేణి కె -4 క్షిపణిని వారంలో రెండుసార్లు పరీక్షించిన తరువాత, అది ఇప్పుడు కక్ష్యలో స్థిర పరిమితులతో పూర్తిగా అభివృద్ధి చెందిందని, ఐఎన్ఎస్ అరిహంత్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.