31.2 C
Hyderabad
May 11, 2024 23: 55 PM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం

#BandiSainjai

పాతబస్తీలోని రోహ్యాంగాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. రోహ్యాంగాలు ఓటు వేయకుండా చూసే ఎన్నికలు రావాలని ఆయన అన్నారు.

హైదరాబాద్ నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని గతంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యలకు బండి సంజయ్ ఇంత ఘాటుగా స్పందించారు. పాతబస్తీ ప్రాంతంలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగానే పాతబస్తీపై సర్టికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంటే.. బిడ్డా.. నీ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం.

రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమి తరిమి కొడతాం’’ అని అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి హెచ్చరించారు.

Related posts

పేరు పిచ్చితో అంబేద్కర్ ను అవమానించిన జగన్ రెడ్డి

Satyam NEWS

నూతన సంవత్సరం సందర్భంగా గ్రామాలలో అశ్లీల నృత్యాలు

Satyam NEWS

బండి సంజయ్ కు స్పల్ప అస్వస్థత

Satyam NEWS

Leave a Comment