కరోనా లాక్డౌన్ సందర్భంగా తొమ్మిది నెలల నుండి ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవన ప్రమాణం దెబ్బతిన్నదని వేతనాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు నేడు మహా సంకల్ప దీక్ష చేపట్టారు.
ములుగు జిల్లా కేంద్రంలోని బొడ్రాయి ఆవరణలో నేడు మహా సంకల్ప దీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి .పి .టి .ఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షులు చాంద్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయంగా ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయునికి ఆర్థికంగా ఆదుకునే లాగా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బి .ప్రణీత్ ,ఆర్. కుమార్ ప్రధాన కార్యదర్శి ఎస్. విశ్వనాధ్ ,టి .విజయ్ సంయుక్త కార్యదర్శి ఎస్ .జగదీష్ కోశాధికారి నిరంజన్ రెడ్డి ప్రచార కార్యదర్శి ఎం. అనిల్ ,ఎం..రమేష్ ఎల్ కిషన్ ఇర్ఫాన్,రాజు ,అఫ్సర్ దేవేందర్ ,వేణు ,గౌస్ ఉద్దీన్ ,శేషు ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.