33.2 C
Hyderabad
May 12, 2024 11: 33 AM
Slider ఖమ్మం

నేషనల్ హైవే మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

#dckmm

ఖమ్మం-సూర్యాపేట నేషనల్ హైవే మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ నేషనల్ హైవే లోని తల్లంపాడు వంతెన వద్ద పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  అండర్ పాస్ రావడంతో విద్యుత్ లైన్ ఎత్తు పెంచాల్సి వస్తుందని అట్టి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. వంతెన మీడియంలో ప్లాంటేషన్ పనులు చేపట్టాలన్నారు. రెండు వైపులా వీధి దీపాల ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. సైనేజ్, హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయాలని, రోడ్ మార్కింగ్ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. పనులన్నీ వారంలోగా పూర్తి చేసి, ప్రయాణికులకు రహదారి అందుబాటులో తేవాలన్నారు.  కలెక్టర్ తనిఖీ సందర్భంగా ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, నేషనల్ హైవే పిడి దుర్గాప్రసాద్, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ సుమ, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

జైలుకు వెళ్లి వచ్చిన రైతులకు ఘన స్వాగతం

Satyam NEWS

ఒంటిమిట్ట రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి  పెద్దిరెడ్డి

Satyam NEWS

Analysis: జీతం కోసం కాదు జీవితం కోసం చదువు

Satyam NEWS

Leave a Comment