ఇటీవల రాష్ట్ర డీజీపీ ఏపీలో ని విజయనగరం జిల్లా కేంద్రం లో పర్యటించి… కొత్తపేట లోని కొత్త గా నిర్మించిన టూటౌన్ పీఎస్ ను ప్రారంభించ న సంగతి విదితమే. దీంతో కాస్త హమ్మయ్య అనుకుంటున్న శాఖ సిబ్బంది కి…జిల్లా పోలీసు బాస్ దీపికా తన ఆకస్మిక తనిఖీలను షురూ చేశారు. ఈ క్రమంలో నే జిల్లాలోని జామి పీఎస్ ను ఎస్పీ ఎం.దీపిక ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ మేరకు స్టేషన్ లో స్టేషను పరిసరాలను, రికార్డులను, సిడి ఫైల్స్, రిసెప్షన్ పరిశీలించారు.స్టేషన్ బయట ఉన్న వాహనాలు వివరాలను అడిగి తెలసుకున్నారు.ఈ తనిఖీ లలో ఎస్. కోట సిఐ సింహాద్రి నాయుడు, జామి ఎస్ఐ వీరబాబు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
previous post