28.7 C
Hyderabad
May 6, 2024 08: 00 AM
Slider రంగారెడ్డి

బండ్లగూడ,పోచారం స్వగృహ ఫ్లాట్లు యధాస్థితిలో అమ్మకానికి సిద్ధం

#bandlaguda

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు బండ్లగూడ,పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయం పై బుధవారం సంబంధిత అధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫ్లాట్లు విక్రయ విధివిధానాల తుది రూప కల్పనపై చర్చించారు.

బండ్ల గూడలో మొత్తం 1501 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉండగా..అందులో వర్క్స్ పూర్తి స్థాయిలో ఉన్నవి 419 ఫ్లాట్లు చ. అడుగు 3వేల రూ.చొప్పున,కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 1082 ప్లాట్లు చ.అడుగు 2750 రూ.చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి వేముల. పోచారంలో 1328 ఫ్లాట్లు 2500 రూ.చొప్పున,కొద్ది స్థాయిలో అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లు 2250 రూ. చొప్పున విక్రయించనున్నట్లు తెలిపారు.

బండ్ల గూడలో 3BHK డీలక్స్ 345 ఫ్లాట్లు,3BHK 444 ఫ్లాట్లు,2BHK 712 ప్లాట్లు.. పోచారంలో..3BHK డీలక్స్ 91ఫ్లాట్లు,3BHK 53 ఫ్లాట్లు,2BHK 884 ఫ్లాట్లు,1BHK 442 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయన్నారు.

3BHK డీలక్స్ ఫ్లాట్ లో ఒక హల్,3బెడ్రూంలు,3అటాచ్డ్ టాయిలెట్స్,కిచెన్,స్టోర్ రూమ్,పూజ రూమ్,బాల్కనీ సౌకర్యాలుంటాయన్నారు.3BHK ఫ్లాట్లో ఒక హాల్,3బెడ్రూం,2 అటాచ్డ్ టాయిలెట్స్,కిచెన్,పూజ రూమ్,బాల్కనీ…2BHK ఫ్లాట్లో హాల్ విత్ కిచెన్,2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం,బాల్కనీ..1BHKఫ్లాట్లు హాల్ విత్ కిచెన్,బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం,బాల్కనీ ఉంటాయని చెప్పారు.

సాధారణ పౌరులు, ఉద్యోగస్తులు ఆసక్తి కలిగిన వారు మీ సేవా ద్వారా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.దీనికి సంంధించి ప్రత్యక యాప్ కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.అర్హులైన వారికి
బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందన్నారు.

www.swagruha.telangana.gov.in సైట్ ను పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

ఆసక్తికలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ,పోచారం లో 6చొప్పున మోడల్ హౌస్ లు ఏర్పాటు చేశామని,వాటిని సందర్శించవచ్చన్నారు.ఆసక్తి కలిగిన వారి కోసం అక్కడికక్కడే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అప్లికేషన్ ఫీజు 1000 రూ.(నాన్ రిఫండబుల్)…

లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుందని వెల్లడించారు.అందుకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదేశించారు.

ఈ సమీక్షా సమావేశం లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ,స్వగృహ సి.ఈ ఈశ్వరయ్య,ఈ.ఈ భాస్కర్ రెడ్డి,పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related posts

కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

Satyam NEWS

అంధుల పాఠశాలకు ఆదాల వింధ్యావళి లక్ష విరాళం

Satyam NEWS

పోలీసు ల అదుపులో టెంపుల్ చోరీల నిందితుడు…!

Satyam NEWS

Leave a Comment