40.2 C
Hyderabad
May 2, 2024 17: 14 PM
Slider జాతీయం

స్టుపిడిటీ: పీరియడ్స్‌‌లో ఉన్నప్పుడు మహిళ వంట చేస్తే…

swaminarayan Bhuj said according to science periods

శాస్త్ర ప్రకారం పీరియడ్స్‌‌లో ఉన్న మహిళ భర్తకు వంట చేసి పెడితే ఆమె వచ్చే జన్మలో వేశ్యగా పుడుతుంది. ఆ వంట తిన్న మగాడు ఎద్దులా పుడతాడు’ అయితే ఈ రహస్యాల గురించి భక్తులకు చెప్పకూడదని ఎందరో మహర్షులు నాకు చెప్పారు కానీ నేను చెప్పకపోతే మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు అందుకే చెప్తున్నా అంటూ విషయాన్నీ చెప్పకనే చెప్పారు స్వామి కృష్ణస్వరూప్ దాస్‌జీ. ఈయన గుజరాత్‌లోని స్వామినారాయణ్ భుజ్ మందిర్‌కు చెందిన ఓ పెద్ద స్వామీజీ.

ఇటీవల ఇక్కడి ఓ కాలేజీలోని 68 మంది విద్యార్థినులను ఒక్కొక్కరుగా బాత్రూంలోకి తీసుకెళ్లి, అండర్‌వేర్లతో సహా దుస్తులు విప్పించి వాళ్లు పీరియడ్స్‌లో ఉన్నారా? లేదా? అని పరీక్షించిన ఆ కాలేజి ఈ స్వామినారాయణ్ మందిర్‌ శిష్యబృందానికి చెందిందేనట. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళలపై ఇంతలా వివక్ష చూపించడమేంటని దేశం మొత్తం ముక్తకంఠంతో గగ్గోలు పెట్టింది. ఈ గొడవ మర్చిపోయేలోపే స్వామి కృష్ణస్వరూప్ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల ఓ పాత వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. ఈ వీడియోపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

భారత్ లో ఎక్కువగా ఉన్న హైబ్రీడ్ రోగ నిరోధక శక్తి

Satyam NEWS

దేశంలోనే అద్భుతమైన పథకం కళ్యాణ లక్ష్మీ

Satyam NEWS

యస్సి, యస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

Satyam NEWS

Leave a Comment