శాస్త్ర ప్రకారం పీరియడ్స్లో ఉన్న మహిళ భర్తకు వంట చేసి పెడితే ఆమె వచ్చే జన్మలో వేశ్యగా పుడుతుంది. ఆ వంట తిన్న మగాడు ఎద్దులా పుడతాడు’ అయితే ఈ రహస్యాల గురించి భక్తులకు చెప్పకూడదని ఎందరో మహర్షులు నాకు చెప్పారు కానీ నేను చెప్పకపోతే మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు అందుకే చెప్తున్నా అంటూ విషయాన్నీ చెప్పకనే చెప్పారు స్వామి కృష్ణస్వరూప్ దాస్జీ. ఈయన గుజరాత్లోని స్వామినారాయణ్ భుజ్ మందిర్కు చెందిన ఓ పెద్ద స్వామీజీ.
ఇటీవల ఇక్కడి ఓ కాలేజీలోని 68 మంది విద్యార్థినులను ఒక్కొక్కరుగా బాత్రూంలోకి తీసుకెళ్లి, అండర్వేర్లతో సహా దుస్తులు విప్పించి వాళ్లు పీరియడ్స్లో ఉన్నారా? లేదా? అని పరీక్షించిన ఆ కాలేజి ఈ స్వామినారాయణ్ మందిర్ శిష్యబృందానికి చెందిందేనట. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళలపై ఇంతలా వివక్ష చూపించడమేంటని దేశం మొత్తం ముక్తకంఠంతో గగ్గోలు పెట్టింది. ఈ గొడవ మర్చిపోయేలోపే స్వామి కృష్ణస్వరూప్ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల ఓ పాత వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. ఈ వీడియోపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.