ఉషా భారతి ,ప్రభాకర్ కృషి తో యోగ విద్య విశ్వవ్యాప్తం..!”సత్యం న్యూస్. నెట్”తో స్వామి శ్రీ అంతర్ముఖానంద
కేరళ సిద్ధ సమాజ వ్యవస్థాపకులు అపర వాల్మీకి,ఆది శంకరాచార్య పరంపర అయిన స్వామి శివానందల వారి ప్రియ శిష్యులు… స్వామి శ్రీ రామానందుల వారి శిష్యులు… విజయనగరం స్వామి శ్రీ రామానంద యోగ జ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ అంతర్ముఖానంద శ్రీగురూజీ డా.వీ.వేంకటేశ్వర రావు..విదేశీ పర్యటన దిగ్విజయంగా ముగిసింది.
విదేశంలో చికాగో లో తిరుపతి కి చెందిన ఉషా భారితీ ,ప్రభాకర్ ల ఆదిత్యంతో దాదాపు మూడు నెలల పాటు విదేశాల్లో ఉంటూ ప్రాణాయామం అయిన యోగ విద్య ను విశ్వ వ్యాప్తం చేసి…చివరకు విశ్వశాంతి హోమాన్ని శ్రీగురూజీ, అమ్మగారులు పూర్తి చేసి..భారతదేశంలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తమ విదేశీ పర్యటన పూర్తి చేసుకున్న తరుణంలో శ్రీగురూజీ తిరిగి ప్రయాణం అవుతున్న సందర్భంలో చికాగో నుంచీ ఆడియో సందేశం అశేష భక్త జనవాహిని కి వినిపించారు.
ఏడాది క్రితమే.. ఈ ప్రాణాయామం విశ్వ వ్యాప్తం అవుతుందన్న శ్రీగురూజీ వాక్కులకనుగుణంగా… ఈ ఏడాది అంటే 2022 సెప్టెంబర్ నుంచీ డిశెంబర్ వరకు శ్రీగురూజీ తమ విదేశీ పర్యటనలో ముగించుకుని..ఈ నెల 15 వ తేదీన భారతదేశం ని అదీ ఏపీ రాష్ట్రం విశాఖ లో అడుగు పెడుతున్నారు.
ఈ సందర్భంగా విశాఖ లో ధ్యానమందిర నిర్వాహకులు…శ్రీగురూజీ పుత్రుడు శివరామకృష్ణ ,విజయగోపాల్, రవిశాస్త్రి, చక్రవర్తి లతో విశాఖ లోని శిష్యులు శ్రీగురూజీ స్వదేశీ ఆగమనం నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే శ్రీగురూజీ… ఆశ్రమం కు ఈ నెల 18న వస్తున్న సందర్భంగా విజయనగరం కు చెందిన డా.సుబ్రహ్మణ్యం…ఆశ్రమ శిష్యులందరితో కలిసి… స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.