భారత సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన దివంగత ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100ల ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ నెల 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 మధ్య కాలంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రముఖులకు ఆమె ఆహ్వానం పలికారు.
next post