విద్యల నగరం కళలకు కాణాచి. బొబ్బలి వీణ అయినా,విజయరామగజపతి ,తాండ్ర పాపారాయుడుల చరిత్ర తెలుసుకోవాలన్న…అపరగాయని సుశీల సంగీతం నెర్చుకున్న సంగీత కళాశాల తెలసుకోవాలన్న ఇలా ఎందరో నడియాడిన స్థలం విజయనగరం జిల్లా. అదీ పురపాలక సంఘం నుంచీ కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన విజయనగరంలో సమస్యలెన్నో.
కాని ఒకే ఒక్క ఫోన్ కాల్…రెండుశాఖల అధికారులలో వణుకు పుట్టించింది.ఫలితం…అతి కొద్ది గంటలలోనే సమస్యకు పరిష్కారం లభించింది.ఆ సమస్య ఏంటంటే… విజయనగరం లో బాలాజీ జంక్షన్ అతి ముఖ్యమైనది.
ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లాలన్నా,స్థానిక ఎమ్మ్లెల్యే ఇంటికి వెళ్లాలన్నా..అతి ప్రాచీనమైన ప్రిన్సిఆఫ్ వీల్స్ (పీడబ్య్లూ) మార్కెట్ కు వెళ్లాలన్నా అలాగే నగరంలో కోట,గంటస్థంభం, దాంతో పాటు రింగ్ రోడ్ద్ కు వెళ్లాలన్న బాలాజీ జంక్షన్ ను తాకాల్సిందే అంబేద్కర్ విగ్రహం ఉన్న ఆ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నెల్స్ తో ఎప్పటికప్పుడు పోలీసులు రద్దీని పర్యవేక్షిస్తుంటారు.
అలాంటి జంక్షన్ లో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ కోట జంక్షన్ కు వెళ్లే సందర్బంగా కుడివైపు మలుపు తిరగాలంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకోవల్సిందే. సరిగ్గా ఆ జంక్షన్ వద్ద కట్టిన మ దిమ్మను వాహనం ఢీ కొడితే మరమ్మతులు కూడా చేయడం జరిగింది.
అంతా బాగుంది కానీ అక్కడే రోడ్డ్ పైనే రాళ్లు,ఇసుక, సిమ్మెంట్ ను క్లీన్ చేయక పోవకడంతో వాహనాలు మలుపు తిప్పే సమయంలో అకస్మా్త్తుగ బ్రేక్ వేయడం…ఊహించని రీతిలో వాహనాలు స్కిడ్ అవడం జరుగుతున్నాయి.
ఆ సమస్యను అటు వీఎంసీ పట్టించుకునే పాపాన పోలేదు.అటు ట్రాఫిక్ సిబ్బంది కూడా తమ రోజు వారి విధులలో పెద్దగా పట్టించుకోలేదు.కానీ అంతలోనే ట్రాఫిక్ సిబ్బంది రాత్రి పూట వాహనంపూ వెళుతుండగా పడిపోవడం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర రావు తక్షణం..ఏఎస్ఐ రామకృష్ణ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో మాట్లాడటం…వెనువెంటనే ఆ సర్కిల్ శానిటనీ ఇన్ స్పెక్టర్ స్పందించి… అనతి కాలంలో మరమ్మత్తులు పూర్తి చేయడం అన్నీ సకాలంలోచకచక జరిగిపోయాయి.
దీంతోఅటు వైపు వేళ్లే వాహన దారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సునాయాశంగా ప్రయాణం చేస్తున్నారు. విజయనగరం ట్రాఫిక్ సిబ్బందికి హేట్సాప్ చెబుతోంది సత్యం న్యూస్.నెట్.