కడప జిల్లా సిద్ధవటం ఎగువ పేట లో ఉన్న శ్రీశైల దక్షిణ ముఖద్వారమైన పెన్నా నది ఒడ్డున వున్న శివాలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు హుండీలు పగలగొట్టి నగదు కానుకలు చోరీ చేశారు.
మూడు బీరువాలు పగలగొట్టి స్వామివారి దుస్తులు ఆభరణాలు ఇంకా ఇతర సామాగ్రి చెల్లచెదరు చేశారు. స్వామి వారి పంచ లోహ విగ్రహాలను వదిలి వెళ్లారు.
ఉదయాన్నే పూజలు నిర్వహించుకొనేందుకు శివాలయానికి వచ్చిన పూజారి చోరీ విషయమై సిద్దవటం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు..
సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గత సంవత్సరం శివరాత్రి నుండి హుండీలు తెరువలేదు.
గతంలో కూడా శివాలయం లో అనేకమార్లు హుండీలు పగలగొట్టి చోరీలు చేశారు.