రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని క్యారికేచర్ కార్టూన్ రూపంలో అభ్యంతరకరంగా ప్రచురించిన సాక్షి దినపత్రిక సిబ్బందిని విధుల నుంచి తొలగించి క్షమాపణ చెప్పాలని పే బ్యాక్ సొసైటీ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది.
పే బ్యాక్ సొసైటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్ లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ నెల 14 వ తేదీన సాక్షి దినపత్రిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని తీవ్ర అభ్యంతరకరంగా ప్రచురించిందని వారు తెలిపారు.
తక్షణమే సంబంధిత సిబ్బంది క్షమాపణలు చెప్పాలని, సిబ్బందిని విధులనుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ అభిమానులకు సాక్షి యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శనివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.