31.2 C
Hyderabad
May 3, 2024 01: 24 AM
Slider నిజామాబాద్

నో వేలైంటన్: అమర జవాన్లకు ఘన నివాళి

bodhan school

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలోని యూపీఎస్ స్కూల్‌లో సర్పంచ్ విజయ ఆధ్వర్యంలో గ్రామస్థులు, స్టూడెంట్లు పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. గ్రామస్థులంతా కలిసి స్కూల్ కు వచ్చి స్టూడెంట్లతో కలిసి అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం స్కూల్ పక్కనే ఉన్న నర్సరీని సర్పంచ్ విజయ, ఉపసర్పంచ్ ఆంజనేయులు పరిశీలించారు.

కోటగిరి మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో స్టూడెంట్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమరుల చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హన్మంతు, సాయిలు, శ్రీధర్, మాజీ సర్పంచ్ గౌస్, ముత్తయ్య, శ్యామ్‌, హైమది, స్కూల్ టీచర్లు యూసుఫ్, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

మరో మగాడితో అక్రమ సంబంధమే హత్యకు కారణం

Satyam NEWS

వేక్సిన్ వేయించుకొని.. జాగ్రత్తలు పాటించి..క్షేమంగా ఉండాలి

Satyam NEWS

సీబీఐ అధికారులనే బెదిరిస్తే సామాన్యుల సంగతేమిటి?

Satyam NEWS

Leave a Comment