31.2 C
Hyderabad
May 3, 2024 01: 45 AM
Slider రంగారెడ్డి

తాండూరు మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

#TandurMarket

తాండూరు మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పైలట్  రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని గంజ్ ఆవరణలో రూ.82 లక్షలతో మార్కెట్ షెడ్డు, టాయిలెట్స్ లను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు.

అదేవిదంగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా  5 మంది రైతులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మరొకవైపు గంజ్ అసోసియేషన్ అద్వర్యం లో వ్యాపారస్తులు తాండూరు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో నూతన మార్కెట్ కోసం 25 ఎకరాలు కేటాయిoచి తాండూరు పట్టణం నుంచి తరలించేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.

అధునాతనమైన రైతు బజార్ గా మార్చడం జరుగుతుందని, ఒకే వేదిక వద్దకు ఇంటెగ్రేటెడ్ మార్కేట్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్  రైతులకు అండగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని,వారిని ఎల్లప్పుడూ కాపాడుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి హాబీబ్, డైరెక్టర్ లు  పద్మమ్మ, భీం రెడ్డి, గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు బంటారం సుధాకర్ , టిఆర్ఎస్ నాయకులు మురళీ గౌడ్,  రాంలింగారెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెసర కొనుగోలు 50 శాతానికి పెంచండి

Satyam NEWS

విశాఖ ఉక్కు అమ్మేస్తున్న బీజేపీ కి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు

Satyam NEWS

ఉజ్జయిని మహాకాలేశ్వరుడి ఆలయంలో అపచారం

Satyam NEWS

Leave a Comment