37.2 C
Hyderabad
May 2, 2024 14: 41 PM
Slider హైదరాబాద్

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మరోసారి మోసం

#amberpet

అంబర్పేట నియోజకవర్గం లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వెరిఫికేషన్ కోసం అంబర్పేట జిహెచ్ఎంసి గ్రౌండ్లో  ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ సెంటర్ ను ఖైరతాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  శంబుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులపై  మండిపడ్డారు  వెరిఫికేషన్ కోసం వచ్చిన మహిళలను ఎండలో నిలబెట్టి కనీస వసతులను కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టమని తక్షణమే ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది వచ్చిన మహిళల కోసం కనీస వసతులను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తానని ప్రజలను మరోసారి మోసం చేస్తుందని  అంబర్పేట నియోజకవర్గం లో ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని వెరిఫికేషన్ కోసం  చుట్టూ తిప్పుకుంటున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీద వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని లేని పక్షాన  రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి శంబుల  శ్రీకాంత్ గౌడ్, షహనాజ్, జాంగిర్, కళ్యాణ్, వినయ్  యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

“జీవితావలోకనం” పుస్తకావిష్కరణ

Satyam NEWS

మోసం చేసిన వైసీపీ నేతలకు ఇక గుడ్ బై

Satyam NEWS

హోమియో చికిత్స: కరోనా ‘ థర్డ్ వేవ్ ‘ థండర్

Satyam NEWS

Leave a Comment