తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ ఆకస్మిక మరణం బాధాకరమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. గోవిందరావు పేట మండలం పస్రా గ్రామానికి చెందిన గజ్జి మల్లికార్జున్ ఇటీవలే గుండె పోటుతో మరణించాడు.
విషయం తెలుసుకున్న తస్లీమా బుధవారం వెళ్ళి అతడి చిత్ర పటానికి పూలతో నివాళులర్పించి,సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మల్లికార్జున్ మరణం బాధాకరమని, మలిదశ ఉద్యమంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పరితపించే మంచి వ్యక్తిని కోల్పోయామని తస్లీమా అన్నారు. ఆమె వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.