చెట్టుకు ఉరివేసుకొని గీతా కార్మికుడు మృతి చెందిన సంఘటన చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొట్లపల్లి సత్తయ్య (63) గీతా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతడు గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో కుటుంబ సభ్యులను డబ్బులు అడిగి మద్యం సేవించేవాడు.
ఇటీవల గ్రామంలో ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగి మద్యంత్రాగడం ప్రారంభించాడు. ఉదయం భార్యను డబ్బు కావాలని అడగగా, లేవని చెప్పడంతో అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. కాగా వ్యవసాయ పొలంలో వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.