37.2 C
Hyderabad
May 6, 2024 13: 46 PM
Slider వరంగల్

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

#taslima

ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన యాట కుమారస్వామి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సోమవారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. ఆయన మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు.

సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో  50 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు అందించి సహృదయాన్ని చాటుకున్నారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,ప్రజా సంఘాల నాయకులు,గ్రామస్థులు ఉన్నారు.

Related posts

గ్రామీణ రోడ్లను నిర్లక్ష్యం చేసిన ప్రధాని మోడీ: మంత్రి పువ్వాడ

Satyam NEWS

CMRF చెక్కు అందజేసిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

కొల్లాపూర్ లో ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

Satyam NEWS

Leave a Comment